వార్ వన్ సైడ్ అని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పినట్లే జరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో విపక్షాలను తెరాస మట్టికరిపించింది. అసలు ఒకటిఅరా సీటైనా వస్తుందో రాదో అన్న ఆందోళనలో విపక్షాలు కొట్టుమిట్టాడే స్థితికి చేర్చింది ఆ పార్టీ. కాగా తెరాస విజయంతో తెదేపా నుంచి తెరాసలోకి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. ఆయన ఎన్నికల విజయం తర్వాత మాట్లాడుతూ... చంద్రబాబు తెలంగాణకు అవసరం లేదని ప్రజలు పంపించేశారు.