కరీంనగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం.. 6 సీట్లూ అధికార పార్టీకే...

మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 10వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో అధికార తెరాస తరపున పోటీ చేసిన అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్.రమణలు విజయభేరీ మోగించారు. 
 
ఈ స్థానంలో మొత్తం 1320 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 17 ఓట్లు చెల్లలేదు. మిగిలిన వాటిలో భానుప్రసాద్‌కు 584 ఓట్లువచ్చాయి. అలాగే, ఎల్. రమణకు 479 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరు అభర్థులు విజయభేరీ మోగించారు.
 
మరోవైపు, ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మ జిల్లాల్లో తెరాస అభ్యర్థులు ఇప్పటికే విజయభేరీ మోగించారు. దీంతో ఎన్నికలు జరిగిన మొత్తం ఆరు స్థానాల్లో అధికార తెరాస అభ్యర్థులు గెలిచినట్టు అయింది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు