అప్పుల బాధతో తల్లి మృతి.. మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య!

శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (14:53 IST)
అప్పుల బాధ భరించలేక తన తల్లి మృతి చెందడాన్ని భరించలేని ఓ కుమారుడు.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ వెంకటతండాకు చెందిన భూక్య చాంది (46) అనే మహిళకు రవి అనే కుమారుడున్నాడు. అప్పుల బాధను భరించలేక ఆమె రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. 
 
తల్లి మరణాంతరం రవి తీవ్రంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్ను మూశాడు. మృతుడికి భార్య రోజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబమంతా విషాదంతో మునిగిపోయింది. 

వెబ్దునియా పై చదవండి