తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ కడియం శ్రీహరిపై టీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి ఎస్సీ కాదనీ, బీసీ అని ఆరోపించారు.
మోత్కుపల్లి వ్యాఖ్యలను కడియం శ్రీహరి ఖండించారు. తాను బీసీని కాదనీ, ఎస్సీ అని, అయితే మాదిగను మాత్రం కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రాజకీయ విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప... వ్యక్తి ఇమేజ్ను కించపరిచే విధంగా ఉండకూడదని హితవు పలికారు. మోత్కుపల్లి చేసిన విమర్శలకు ఆధారాలు ఏమైనా ఉంటే వరంగల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని ఆయన సవాల్ చేశారు.