ఇదిలా ఉంటే.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ మేరకు శుక్రవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో నినాదాలు చేశారు. అనంతరం, లోక్ సభలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సీటు ముందుకు వెళ్లి నిలబడి మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు.