భార్య దూరమైన కారణంగానే మనస్తాపానికి గురైన రంగనాథ్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పరుచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. భార్య స్థానం ఎంతగొప్పదో, ఆమెను పోగోట్టుకున్న పురుషులకే తెలుస్తుందని వివరించారు. రంగనాధ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. భార్యా వియోగం, మిగతా వియోగాలకన్నా భయంకరమైనదని, దాన్ని ఆరేళ్లు రంగనాధ్ అనుభవించారని పరుచూరి గుర్తు చేసుకున్నారు.