భార్య దూరం కావడంతోనే రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారేమో: పరుచూరి

ఆదివారం, 20 డిశెంబరు 2015 (12:13 IST)
లేత వయసులో తొందరపాటు నిర్ణయంతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడవచ్చుగానీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత నలుగురికీ మార్గదర్శకంగా నిలవాల్సిన రంగనాథ్ ఇలా తనువు చాలించడం బాధాకరమని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. 
 
భార్య దూరమైన కారణంగానే మనస్తాపానికి గురైన రంగనాథ్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పరుచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. భార్య స్థానం ఎంతగొప్పదో, ఆమెను పోగోట్టుకున్న పురుషులకే తెలుస్తుందని వివరించారు. రంగనాధ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. భార్యా వియోగం, మిగతా వియోగాలకన్నా భయంకరమైనదని, దాన్ని ఆరేళ్లు రంగనాధ్ అనుభవించారని పరుచూరి గుర్తు చేసుకున్నారు. 
 
తన తండ్రి కూడా అమ్మ చనిపోయిన తరువాత 52వ రోజున చనిపోయారన్నారు. కాగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రంగనాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. నొప్పించని మనసు గల రంగనాథ్ ఇలా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సహనటులు అంటున్నారు.  

వెబ్దునియా పై చదవండి