ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తప్పక ఆదరిస్తారని, అధికారంలో ఉన్న పార్టీకి గుణపాఠం చెప్పేలా ఫలితాలు వస్తాయన్నారు. పార్టీ మెదక్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డితో కలసి హైదరాబాదులో తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, తనను మెదక్ లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్టానానికి సునీత కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేయనున్నారు.