పొన్నం అదొదిలేశారు... బాలకృష్ణ మీద పడ్డారు... ఇంతకీ ఏంటా గొడవ...?

గురువారం, 4 ఫిబ్రవరి 2016 (15:40 IST)
పాతబస్తీలో తమ నేతలపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి తెగబడిన విషయాన్ని పొన్నం ప్రభాకర్ కాస్తంత పక్కన పెట్టేసి ఇపుడు తాజాగా హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ పైన టార్గెట్ పెట్టారు. మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు వేయడాన్ని పొన్నం తప్పుబట్టారు. ఈ మేరకు పొన్నం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తెలంగాణ పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారంటూ తన ఫిర్యాదులో ప్రశ్నించారు. బాలయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురంకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఓటు వేశారో చూడాలని ఈసీని కోరారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఓటరుగా ఉన్న బాలయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి