తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఇద్దరూ మెట్రో రైలు ప్రాజెక్టును ఉపసంహరించుకునే నిర్ణయానికి కారణం కాదా అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి నిలదీశారు. బుధవారంనాడు మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ దొరతనమే మెట్రో రైలు హైదరాబాద్ నుంచి ఉపసంహరించుకోవడానికి కారణమంటూ దుయ్యబట్టారు.