కార్లు కొనడానికి, బంగళాలు కట్టించడానికి కోట్లకు కోట్ల ఖర్చు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలకు మాత్రం రుణమాఫీ చేయడానికి పైసా కూడా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గజ్వేల్ టీడీపీ నేత ప్రతాప్రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించిన రేవంత్ రెడ్డి తెరాస సర్కారుపై మండిపడ్డారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ స్పందన సరిగా లేకపోవడం వల్లే ప్రత్యక్ష ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్లు కొనడానికి, బంగళాలు కట్టించడానికి కోట్లకు కోట్ల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం లక్ష రూపాయల అప్పు ఉన్న రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.