ఆయన గురువారం మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ విధానాల వల్లే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్తో కలసి ముందుకు సాగుతున్నామన్నారు. మీకు ముఖ్యమంత్రి ఉంటే, మాకు ప్రధానమంత్రి ఉన్నారని టీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరించారు.
డిసెంబర్ నెలలో తన కూతురి పెళ్లి చేస్తానని... ఆ తర్వాత కేసీఆర్ పెళ్లి చేస్తానని రేవంత్ హెచ్చరించారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఈ రోజు టీడీపీ, బీజేపీలు మహాధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, మండవ వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు హాజరయ్యారు.