ఒకవేళ ఏపీ అధికారులు ఒత్తిడి తెస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులను బ్యాంకర్లకు అందజేశారు. కాగా, ఇవాళ బ్యాంకర్లతో సీఎస్ జరిపిన సమావేశంలో ఏపీ కార్మిక శాఖ ఖాతాలోకి రూ.609 కోట్లు, ఏపీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఖాతాలోకి రూ.20 కోట్లు తరలించినట్లు గుర్తించారు.