ఖమ్మం ఇంట్లోనే ఉంటా.. ఏసీబీ ఎపుడు పిలిస్తే అపుడు సిద్ధం : సండ్ర

గురువారం, 2 జులై 2015 (11:42 IST)
ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులు గాలిస్తూ వచ్చిన టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. ఇకపై ఖమ్మ ఇంట్లోనే ఉంటానని, ఏసీబీ ఎపుడు పిలిస్తే అపుడు వెళ్లి విచారణకు హాజరవుతానని ప్రకటించారు. 
 
తన ఆరోగ్యం కుదుటపడిందని పేర్కొంటూ, విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నానని ఆయన నిన్న ఏసీబీకి లేఖ రాసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో... బుధవారం రాత్రే ఆయన ఖమ్మం చేరుకున్నట్లు సమాచారం.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాను ఖమ్మంలోనే ఉంటానని ప్రకటించారు. అంతేకాక ఏసీబీకి తాను లేఖ రాసిన తర్వాత తననెవరూ సంప్రదించలేదని కూడా సండ్ర వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి