ఆ సమయంలో రైలు రాదన్న నమ్మకంతోనే అతడు బస్సును పట్టాలు దాటించే యత్నం చేయగా, అదే సమయంలో వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు మృత్యువాత పడగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న 38 మందిలో కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.