ఉదయాన్నే ఈ ఘోర విషాదాన్ని చూడాల్సి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము నాందేడ్ నుంచి బయలుదేరిన దగ్గర్నుంచి నిబంధనల ప్రకారం రైలు హారన్ మోగిస్తూనే వచ్చామనీ, కానీ మాసాయిపేట వద్ద అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి బస్సు రావడం చూసి గుండె పట్టేసినంత పనైందన్నారు.
కానీ ఏమీ చేయలేకపోయామనీ, కళ్ల ముందు పసిబిడ్డల ప్రాణాలు పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైలును ఆపిన తర్వాత కొంతమంది తమపై దాడి చేసేందుకు వచ్చారనీ, కానీ అక్కడే మరికొందరు వారించారన్నారు. తాము వెంటనే రైల్వే అధికారులకు సమాచారాన్ని చేరవేసినట్లు వెల్లడించారు.