ప్రత్యేక కోర్టు చేపట్టాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద లాయర్లు రచ్చ రచ్చ చేశారు. కోర్టు ద్వారాలను మూసేసి.. లోనికి ఎవరిని పోనివ్వకుండా అడ్డుకున్నారు. తెలంగాణకు ప్రత్యేక కోర్టును కేటాయించాలంటూ ఆందోళనకు దిగారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ జడ్జిపై కోడి గుడ్డు విసరబోయారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళన అదుపులోకి వచ్చింది.
ఈ ఆందోళనలో భాగంగా మెయిన్ గేటు మూసివేసిన లాయర్లు న్యాయమూర్తులు సహా ఏ ఒక్కరూ లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. లాయర్ల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. అయినా వెనక్కు తగ్గని లాయర్లు ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు పోలీసులు న్యాయవాదులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు, న్యాయవాదుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.