తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పి శంకర్రావు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సొంత పార్టీ వారే సర్వనాశనం చేశారన్నారు. ఇంకా వారే కీలక పార్టీ పదవుల్లో కొనసాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్పా పార్టీకి భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు. తనతోపాటు గతంలో మంత్రులుగా పని చేసిన వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణల వల్లే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఓడిపోయిందని పి శంకర్రావు మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.