తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారంలో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్కిరణ్ హత్య గావింపబడినట్లు తేలింది. గురువారంనాడు పొద్దుటపూట స్కూలుకు వెళ్ళిన ఉదయ్కిరణ్ గురువారం సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్కిరణ్ మృతదేహం ఉన్నట్లు కనుగొన్నారు.