తనకు కాబోయే భర్తతో పాటు పామ్హౌస్కు వచ్చిన ఓ యువతిపై ఏడుగురు స్నేక్ గ్యాంగ్ సభ్యులు అత్యంత అమానుషమైన రీతిలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులోని నిందితులు న్యాయస్థానంలో లొంగిపోవడానికి సహకరించినవారెవరు, నిందితుడు ఖాదర్ బారక్బ తండ్రి ఆలీ బారక్బ ఒక్కరేనా లేదా పోలీసుల పాత్ర ఉందా? సమాధానం వెతికే పనిలో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు.
సామూహిక అత్యాచారం చేసిన తర్వాత నిందితులు ఫైసల్ దయానీ, ఖాదర్ బారక్బ, సలామ, పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం పరారయ్యారు. వీరిలో ఖాదర్ బారక్బ, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్ 11న రంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. మరో ముగ్గురు నిందితులు సలామ, మహ్మద్ పర్వేజ్, మహ్మద్ ఇబ్రహీంలను పోలీసులు మూడో తేదీన అరెస్టు చేశారు. అప్పటికీ ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ పరారీలోనే ఉన్నాడు.