నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఆర్కే డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదన్న కారణంతో విద్యార్థినిపై సహ విద్యార్థి కత్తితో దాడి చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లింగంపేటకు చెందిన స్నేహ, ఆర్ కే డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
పరిస్థితి విషమించడంతో ఇద్దరినీ చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం స్నేహను నిజామాబాద్కు, సాయికిరణ్ రెడ్డినిహైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.