తెలంగాణాలో కేసీఆర్ సొంత డబ్బా ఎక్కువైంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

బుధవారం, 27 మే 2015 (15:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధినేత కె చంద్రశేఖర్ రావు సొంత డబ్బా ఎక్కువైందని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందంటూ రాష్ట్ర పదో తరగతి సాంఘిక శాస్త్రంలో పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. 
 
ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర అంతా కేసీఆర్ సొంత డబ్బాలా ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్రం కోసం పోరాడిన ప్రొ.జయశంకర్, బలిదానాలు చేసిన అమరవీరుల పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. భావితరాలను తప్పుదారి పట్టించేలా పాఠ్య పుస్తకాలున్నాయని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి