ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర అంతా కేసీఆర్ సొంత డబ్బాలా ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్రం కోసం పోరాడిన ప్రొ.జయశంకర్, బలిదానాలు చేసిన అమరవీరుల పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. భావితరాలను తప్పుదారి పట్టించేలా పాఠ్య పుస్తకాలున్నాయని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.