అలాగే, కూకట్పల్లి నాలా నుంచి వచ్చే పైపును తిరిగి తీసివేసి నూతన పైపును వేసేందుకు మూడు కిలోమీటర్ల మేర భారీ సొరంగాన్ని తవ్వనున్నారు. దీని ద్వారా భారీ పైప్లైన్ వేసేందుకు జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. 24 గంటల పాటు మూడు షిఫ్ట్లలో సిబ్బంది 10 రోజుల పాటు ఈ పనులను చేయనున్నారు.
సికింద్రాబాద్ నుంచి రాణిగంజ్ వైపు అక్కడి నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడీగూడ వైపు మళ్లించారు. లక్షకుపైగా వాహనాలు ట్యాంక్బండ్ రోడ్డుపై రాకపోకలు జరుగనున్న నేపథ్యంలో 10 రోజుల పాటు మార్గాన్ని మూసివేయడం ద్వారా తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు కలిగే అవకాశం ఉంది. ట్యాంక్బండ్ మూసివేతపై ముందస్తు సమాచారం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.