ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఉమ్మడి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అక్కడ టీ ఏసీబీ తరపు న్యాయవాదులను సుప్రీం త్రిసభ్య ధర్మాసనం చీవాట్లు పెట్టి.... బెయిల్ రద్దుచేయడం కుదరదని తెగేసి చెప్పిన విషయంతెల్సిందే.
ఈ తీర్పు వెలువడిన తర్వాత ఏఏజీ రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి హైకోర్టులో నిష్పాక్షిక నిర్ణయాలు జరగడంలేదని, ప్రత్యేక హైకోర్టు ఉంటేనే న్యాయం జరుగుతుందన్నారు. పనిలోపనిగా.. ఉమ్మడి హైకోర్టులోని న్యాయమూర్తులతోపాటు సుప్రీంకోర్టులోని కొందరు న్యాయమూర్తులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు.