రాష్ట్రం ఏర్పడి ఇంతకాలమైనా... ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే పనిలోనే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఉన్నారని కృష్ణసాగర్ ఆరోపించారు. పరిపాలించడం చేతకాని కేసీఆర్... రాజకీయాలు చేసుకుంటూనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఎంతకాలం గడుపుతారని... ఏదో ఒక రోజు ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలు గుర్తిస్తారని అన్నారు.
మరికొన్ని రోజులు గడిస్తే... కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్న కొత్త వాదాన్ని తెర మీదకు తెస్తారని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో సత్సంబంధాలను పెంచుకోకుండా... ఎలా పరిపాలిస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.