నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ : లాక్డౌన్ పొడగింపుపై కీలక నిర్ణయం

ఆదివారం, 30 మే 2021 (09:27 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరుగనుంది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో ఈ కేబినెట్ మీటింగ్ జరుగనుంది. ఇందులోలాక్డౌన్ పొడిగింపుపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
లాక్డౌన్‌తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే రాష్ట్రంలో కఠినంగా లాక్డౌన్ అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. 
 
ప్రస్తుతం 24 గంటల్లో 20 గంటలు లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. జూన్ నెలలో కూడా లాక్‎డౌన్ అమలు చేస్తారా అన్న ప్రశ్న తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠగా మారింది. లేక ఇదే పరిస్థితి ఉంటే మరిన్ని సడలింపులు ఇస్తారా అనే అంశంపై కేబినెట్ సమావేశం అనంతరం సమాచారం రానుంది. లాక్‎డౌన్‎పై స్పష్టత రావాలంటే మరో కొన్ని గంటలు వేచివుండాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు