తెలంగాణలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా చెపుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. తనను విమర్శిస్తే ఒప్పుకుంటాను కానీ తెలంగాణను అవమానించేవిధంగా మాట్లాడితే మాత్రం ప్రాణం పోయినా సహించేది లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు డబ్బిస్తే... తెలంగాణకు ఒక్కసారి ఇచ్చారు. రూ. 11,600 కోట్లు ఇంకా రావాల్సి వుంది. అసలు ఇప్పటివరకూ ఇచ్చిందే 60 వేల కోట్లు అయితే లక్ష కోట్లు ఇచ్చామంటున్నారు. అదేమీ భాజపా ఇచ్చింది కాదు... కేంద్రం ఇచ్చింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ఇవ్వాల్సిందే.