తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ అధినేత, కేంద్ర మాజీ మంత్రి కె చంద్రశేఖర్ రావు సోమవారం తన జీవితంలోనే తొలి విదేశీ పర్యటన చేపట్టారు. ఆయన సోమవారం ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్కు చేరుకున్నారు. సింగపూర్లోని రిట్జ్ కార్టన్ హోటల్ వద్ద కేసీఆర్కు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.
కాగా, ఈ పర్యటన కోసం ఆయనకు మూడు రోజుల క్రితమే పాస్ పోర్టును మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఆయనకు పాస్ పోర్టు లేదు. కేంద్ర కార్మిక శాఖామంత్రిగా పని చేసినప్పటికీ ఆయనకు పాస్ పోర్టు లేకుండానే కాలం వెళ్లదీశారు.