తెలంగాణ రాష్ట్రంలో భూమిలేని దళితులకు భూ పంపిణీకి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు15 నుంచి మొదటి విడత భూ పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్నామని సెర్ప్ సీఈవో మురళీ తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన దళితులకు భూ పంపిణీ అమలు-సాధ్యాసాధ్యాలపై చర్చ కార్యక్రమంలో మురళి పాల్గొన్నారు.