పాఠ్యపుస్తకాల నుంచి తెలంగాణ చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఇదే అంశంపై పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో మార్పులను సూచిస్తూ జారీ అయిన జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.