హైదరాబాద్‌ను గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబే: కర్నె

బుధవారం, 4 మార్చి 2015 (12:31 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫైరయ్యారు. హైదరాబాదును విశ్వ నగరంగా తీర్చిదిద్దిన ఘనత తనదేనని చెప్పుకుంటున్న చంద్రబాబు, అసలు నగరాభివృద్ధికి చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
హైదరాబాదును గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబేనని కూడా ఆరోపించారు. వ్యవసాయం దండగన్న బాబు, ఇప్పుడు వ్యవసాయంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
 
టీడీపీ నేతలను తాము కొనుగోలు చేస్తున్నామన్న చంద్రబాబు... వైసీపీ నేతలు ఎస్పీవై రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను ఎందుకు కొన్నారో చెప్పాలని కర్నె డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి