అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలంటూ టీఆర్ఎస్కు చెందిన నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె కవితకు ఆహ్వానం అందింది. దాంతో ఆమె శనివారం ఉదయం చెన్నై వెళ్లనున్నారు. కాగా, అన్నాడీఎంకే శాసనసభా నాయకురాలిగా జయలలిత ఎన్నికైన వెంటనే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆమెకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.