ట్వీట్ల యుద్ధం : కేటీఆర్ వర్సెస్ రేవంత్

సోమవారం, 20 సెప్టెంబరు 2021 (10:31 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల మధ్య ట్వీట్ల యుద్ధానికి తెరలేసింది. డ్రగ్స్ వ్యవహారం ఇందుకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ డ్రగ్స్ వ్యవహారంపై వారిద్దరూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. 
 
దేశంలో పెరుగుతున్న డ్రగ్స్  బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని.... మంత్రి కేటిఆర్ కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
 
దీనిపై స్పందించిన కేటీఆర్... 'నేను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేపించుకోవడానికి సిద్ధామా?. ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో టెస్ట్స్ చేపించుకునేందుకు నేను రెడీ. ఆ టెస్ట్‌లో నాకు క్లీన్ చిట్ వస్తే, మీరు క్షమాపణలు చెబుతారా?. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?' అంటూ సవాల్ విసిరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు