తెలంగాణ ఎంఎస్‌ఓలపై చర్యకు కేంద్రం రంగం సిద్ధం!

శుక్రవారం, 1 ఆగస్టు 2014 (08:58 IST)
తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్ఓలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇదే అంశంపై తనను కలిసిన కొంతమంది పార్లమెంట్ సభ్యులకు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై వచ్చే మంగళవారం రాజ్యసభలో చర్చించేందుకు సభావ్యవహారాల కమిటీ అంగీకరించింది. ఛానల్స్ నిషేధం, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగడం తదితర అంశాలపై రాబోయే మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుందని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ప్రకటించారు. 
 
వచ్చే మంగళవారం ఈ అంశం రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు... చర్చకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలంగాణ ఎంఎస్ఓలపై తీసుకునే చర్యలను ప్రకటించవచ్చని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి