మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ లక్షణాలతో 1050 మందికి పరీక్షలు చేయగా, వారిలో 366 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది. ఇదిలా ఉండగా సోమవారం ఒక్క రోజునే 52 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ సోకినట్లు తెలిసింది. వారిలో ఐదుగురు వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం.