తెలంగాణలో వైకాపాను బలోపేతం చేయడానికి ఆ పార్టీ నడుం బిగించి కదులుతోంది. తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల డిసెంబర్ 8 నుంచి తన పరామర్శ యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాలమూరు జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రను ఈ జిల్లాలో నాలుగు లేదా ఐదు రోజుల పాటు కొనసాగిస్తారని సమాచారం. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 16 కుటుంబాల వారిని షర్మిల పరామర్శిస్తారు.