ఈ చర్చలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా నేతల పేర్లు పెట్టడం సరికాదని అన్నారు. ఎన్టీఆర్ పేరును ఆంధ్రాలోని బస్టాండులకు, ఎయిర్ పోర్టులకు పెట్టుకోవాలని సూచించారు. అంతేగాకుండా, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొమురం భీం పేరు పెట్టాలని సభాముఖంగా సూచించారు.