ఎన్టీఆర్ పేరు వద్దు.. రాజీవ్‌ పేరే ఉండాలి : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే!

శుక్రవారం, 21 నవంబరు 2014 (16:01 IST)
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడానికి వీలు లేదనీ, దివంగత రాజీవ్ గాంధీ పేరే ఉండాలని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 
 
శంషాబాద్ ఎయిర్ పోర్టులో డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం వివాదాస్పదమైన విషయం తెల్సిందే. తెలంగాణ నేతలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. 
 
ఈ చర్చలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా నేతల పేర్లు పెట్టడం సరికాదని అన్నారు. ఎన్టీఆర్ పేరును ఆంధ్రాలోని బస్టాండులకు, ఎయిర్ పోర్టులకు పెట్టుకోవాలని సూచించారు. అంతేగాకుండా, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొమురం భీం పేరు పెట్టాలని సభాముఖంగా సూచించారు. 

వెబ్దునియా పై చదవండి