అక్కినేని మల్టీస్టారర్ 'మనం'.. భాయ్ ఎగ్జయిట్ అవుతున్నాడు!

శనివారం, 31 ఆగస్టు 2013 (12:34 IST)
FILE
అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు కలిసి 'మనం' అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ మాత్రం 'మనం' కాదు. '3G' (త్రీ జెనరేషన్స్) అనే టైటిల్ అనుకున్నారట. అయితే, చాలా డిస్కషన్ తర్వాత ఇంగ్లిష్ పేరైతే ప్రేక్షకులకు సరిగ్గా చేరదేమోనన్న ఉద్దేశంతో, 'మనం' అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని నాగార్జున మీడియాకు తెలిపారు.

ఈ సినిమా గురించి నాగార్జున చాలా ఎగ్జయిట్ అవుతూ చెబుతున్నారు. ఇది తన హృదయానికి దగ్గరగా వుండే కథ అని అన్నారు. దర్శకుడు విక్రంకుమార్ ఏడాదిన్నర పాటు కష్టపడి ఈ కథ తయారుచేశాడని తెలిపారు. వచ్చే నెలలో జరిగే షూటింగులో తండ్రి, చైతన్య, తాను ముగ్గురూ కలిసి పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరించడం జరుగుతుందని నాగార్జున చెప్పారు.

వెబ్దునియా పై చదవండి