అమీ జాక్సన్‌ను టెన్షన్ పెడుతున్న 'ఎవడు'!

శనివారం, 9 నవంబరు 2013 (13:24 IST)
FILE
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, శృతిహాసన్, అమీజాక్షన్‌లు ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ఎవడు. అయితే 'ఎవడు' సినిమా తనను చాలా ఇరిటేడ్ చేస్తుందంటోంది అమీ జాక్సన్‌. మెగాపవర్‌స్టార్ రామ్‌ చరణ్‌ సరసన అవకాశం అనేసరికి ఎగిరి గంతేసి మరీ నటించేసిన ఈ అందాల ముద్దుగుమ్మ.

ఇప్పుడు సదరు సినిమా రిలీజింగ్ డేట్ పోస్ట్‌పోన్ అవుతుండడంతో తల పట్టుకుంటోంది. అంతకుముందు హిందీ, తమిళంలో నటించిన అమీకి తెలుగులో ఇదే తొలి ఆఫర్‌. అయితే విడుదలకి సిద్ధమై కూడా 'ఎవడు' వాయిదా పడడంతో ఇరిటేట్‌ అవుతోంది. 'ఎవడు' రిలీజై టాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్లు దక్కే అవకాశం కోసం ఎదురు చూస్తూ తెగ తహతహలాడిపోతోంది.

ఈ సినిమాలో బికినీలతో దర్శనమిచ్చి తన టాలెంట్‌ ఏమిటో చూపించింది. కానీ 'ఎవడు' ఏమో అంతకంతకీ వెనక్కి పోతోంది. ప్రస్తుతం టాప్ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో 'ఐ' సినిమా చేస్తోంది ఈ భామ. ఈ చిత్రంతో అమీకి ఇటు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం వుందని చెప్పవచ్చు.

అయితే ఐ రావడానికి ఇంకా సమయం ఉన్నందున ముందుగా ఎవడొచ్చి తనకి బ్రేక్‌ ఇస్తాడని ఆమె కలల కంటోంది. ఈ చిత్రం డిసెంబర్‌లోనే వస్తుందా, లేక సంక్రాంతికి వాయిదా పడుతుందా అనే విషయంలో ఇంకా ఎవరికి కూడా క్లారిటీ లేదు.

వెబ్దునియా పై చదవండి