అల్లు శిరీష్‌ 'కొత్త జంట' చిత్రం... చిరంజీవి క్లాప్...

గురువారం, 30 మే 2013 (16:28 IST)
WD
అవును శిరీష్‌ సెల్‌షిఫ్‌. అల్లు శిరీష్‌ను చాలా దగ్గర నుంచి చూశాను. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎక్కువ సెల్‌ఫిష్‌ మేన్‌ అంటూ అల్లు శిరీష్‌ గురించి దర్శకుడు మారుతి చెప్పారు. ఒక సెల్‌ఫిష్‌ అబ్బాయికి, మరో సెల్‌ఫిష్‌ అమ్మాయికి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమ కూడా సెల్‌ఫిషేనా... ఇప్పటి యూత్‌లో చాలామంది ఇలానే ఉన్నారు.. అంటూ అల్లు శిరీష్‌తో 'కొత్త జంట' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మారుతి చెప్పాడు.

గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చిరంజీవి ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టారు. డా. డి. రామానాయుడు స్విచ్చాన్‌ చేశారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... పైవిధంగా చెప్పారు.

బేనర్లలో అల్లు శిరీష్‌, హీరోయిన్‌ రెజీనా కాసాంద్రా ఇద్దరు వెయ్యి రూపాయల కట్టల్ని పట్టుకుని.. విసురుతూ రకరకాల స్టిల్స్‌ ఉన్నాయి. ఈ కథ అల్లు శిరీష్‌ నిజ జీవిత కథేనా అని విలేకరి అడిగితే... మారుతీ స్పందించాడు. నిజంగానే శిరీష్‌ సెల్‌ఫిష్ అన్నాడు. దీనికి శిరీష్‌ కూడా మాట్లాడుతూ... అవును.. మారుతీ చెప్పినట్లు.. నేను స్వార్థపరుడినే.. కానీ నాలో కొన్ని మంచి కోణాలు కూడా ఉన్నాయి.. వాటిని మారుతీ తెరపై చూపించనున్నాడని చెప్పారు. ఈ చిత్రం జూన్‌ 20 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది.

వెబ్దునియా పై చదవండి