విలన్ అజయ్ హీరోగా నటిస్తోన్న చిత్రం "ఆ ఒక్కడు". ఇందులో మధురిమ హీరోయిన్గా నటిస్తోంది. టాలీ 2 హాలీ ఫిల్మ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం రాత్రి హైటెక్స్లోని నోలిటాల్ హోటల్లో జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఎం.ఎం. కీరవాణి ఆడియోను విడుదల చేయగా, డి. సురేష్ బాబు సీడీని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో విజయ్ చందర్, రవితేజ, రాజమౌళి, సునీల్, రాంప్రసాద్తో పాటు చిత్ర నిర్మాతలు సుధాకర్ చాగంటి, ఇందుకూరి గణపతిరాజు, దర్శకుడు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆడియో విడుదల సందర్భంగా విజయ్చందర్ మాట్లాడుతూ.. దర్శకుడు మూర్తికి మంచి భవిష్యత్ ఉందన్నారు. తాను డబ్బింగ్ చెబుతుండగా అందరి నటనను చూశానని, అన్ని సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించాడని కొనియాడారు. అజయ్ మంచి నటనను కనబరిచాడని చెప్పారు.
రాజమౌళి మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన "సింహాద్రి" మినహా అన్ని సినిమాల్లో అజయ్ విలన్గా నటించాడని, అతనిలో హీరో ఉన్నాడనే విషయం ఈ సినిమాలోనే గ్రహించానన్నారు. ఈ చిత్రం ద్వారా అజయ్కు మంచి గుర్తింపు లభిస్తుందని రాజమౌళి ఆశించారు.
హీరో రవితేజ మాట్లాడుతూ.. అతనొక్కడే చిత్రంలోనే అజయ్ మంచి ఆర్టిస్టుగా గుర్తింపు పొందాడని గుర్తు చేశారు. తన కెరీర్ను రాజమౌళి పూర్తిగా మార్చేశారని అజయ్ చెప్పారు. "ఆ ఒక్కడు" థ్రిల్లర్ సబ్జెక్ట్ అని, చివరి వరకు సస్పెన్స్తో కొనసాగుతుందని వెల్లడించారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.