'ఎవడు' స్టోరిని లీక్ చేసిన కాజల్.. టాలీవుడ్ సంచలనం!
గురువారం, 8 ఆగస్టు 2013 (08:38 IST)
FILE
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా, అందాల భామలు శృతిహాసన్, అమీ జాక్సన్లు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఎవడు'. ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పుడు స్టోరిని కాజల్ అగర్వాల్ లీక్ చేసిందన్న వార్తలు టాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
అల్లుఅర్జున్కు హీరోయిన్ ప్రేయసి, కొందరు అల్లుఅర్జున్ ను దారుణంగా కొట్టి హీరోయిన్ను చంపుతారు. ఈఘటనలో అల్లుఅర్జున్ చనిపోతాడని భావిస్తారు. అయితే అల్లుఅర్జున్ బతికి తనెవరో తెలియకుండా రాంచరణ్లా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వచ్చి తన ప్రేయసి హంతకులపై పగ తీర్చుకుంటాడు.
ఇందులో హీరోయిన్ పాత్రను చంపడం, ఆపాత్ర కూడా కొంచెం కష్టంగా అనిపించడంతో 'ఎవడు'లో హీరోయిన్గా నటించడానికి తిరస్కరించాను అని చెప్పిందట కాజల్. కాజల్ చెప్పిన స్టోరిలో నిజమెంతుందో తెలీదు కాని ఇప్పుడు ఈ స్టోరి టాలీవుడ్లో హాట్ టాపిక్లా మారింది.