టాలీవుడ్‌లో రూ. 27 కోట్లకు అమ్ముడైన రజనీ "రోబో"

WD
సూపర్‌స్టార్ రజనీకాంత్, అందాల తార ఐశ్వర్యారాయ్ నటించిన రోబో తెలుగు హక్కులు రూ. 27 కోట్లు పలికింది. ఈ హక్కులకోసం ముగ్గురు నిర్మాతలు పోటీపడగా చదలవాడ శ్రీనివాసరావు కైవసం చేసుకున్నట్లు సమాచారం.

రోబో హక్కులు తనకు దక్కడంపై శ్రీనివాసరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ప్రతిష్టాత్మక రోబో చిత్రం హక్కులను కైవసం చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు.

రోబో చిత్రాన్ని అత్యధిక ప్రింట్లతో విడుదల చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. రజనీకాంత్‌కు టాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉన్న దృష్ట్యా భారీ మొత్తంతో కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ సినీవర్గాలు చెపుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి