టాలీవుడ్ అగ్రహీరో శ్రీకాంత్ కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం 'మహాత్మా'. మహాత్మాగాంధీ ఆశయాలు నేపథ్యంలో ఈనాటి ట్రెండ్కు అనుగుణంగా చిత్రం రూపొందుతోంది.
ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆడియోను ఆగస్టు 15న విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇందులో విశేషమేమంటే..? గాంధీ మనవడు "తుషార్గాంధీ" చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నుంచి గ్రీన్సిగ్నల్ తెచ్చేందుకు ప్రముఖ రాజకీయ నాయకుడి సలహాలు తీసుకున్నారు.
మరోవైపు.. చిరంజీవి సన్నిహితుడుగా శ్రీకాంత్ మంచి పేరున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి, శ్రీకాంత్లు నటించిన "శంకర్దాదా జిందాబాద్" సినిమాను కూడా తుషార్గాంధీకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.