'నాయక్' - 'మిర్చి' దెబ్బకు "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వాయిదా?

శనివారం, 1 డిశెంబరు 2012 (17:19 IST)
File
FILE
చాలాకాలం తర్వాత తెలుగులో వస్తున్న మల్టీస్టార్ చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించారు. ఈ సినిమా సంక్రాంతికి బరిలో ఉండగా, జనవరి 11వ తేదీన రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

అయితే, ఈ చిత్ర విడుదలను వాయిదా వేయాలన్న యోచనలో ఉన్నట్లు నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో రామ్ చరణ్ కొత్త చిత్రం 'నాయక్' జనవరి 9న అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే, దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో హీరో ప్రభాస్ నటించిన "మిర్చి" చిత్రం కూడా సంక్రాంతికే రానుంది. దీంతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి ఆశించినన్ని థియేటర్లు అందుబాటులోలేవు.

ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఆశించినన్ని థియేటర్లు లేకపోవడంతో చిత్రాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని, ఒక్క పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తియ్యిందని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఈ చిత్రం విడుదలపై డిసెంబరు 15న నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి