నిశ్చితార్థ వేడుకలకు అభిమానులు రావొద్దు : నాగబాబు

గురువారం, 1 డిశెంబరు 2011 (14:06 IST)
File
FILE
యువహీరో రామ్ చరణ్ తేజ్, కామినేని ఉపాసన నిశ్చితార్థ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాల నేతలు రావొద్దని చిరంజీవి సోదరుడు నాగబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని అందువల్ల ఈ కార్యక్రమానికి అభిమానులు దూరంగా ఉండాలని, ఈ విషయాన్ని వారే అర్థం చేసుకోవాలని సూచించారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత అభిమానులకు ప్రత్యేక ఫంక్షన్ ఏర్పాటు చేస్తామని నాగబాబు చెప్పారు.

ఇదిలావుండగా, చెర్రీ నిశ్చితార్థానికి మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ ద్వారకా తిరుమల రావు చెప్పారు. కాగా ఈ ఎంగేజ్‌మెంట్‌కి వచ్చే వారికి కార్డులు ఉంటేనే లోపలకు అనుమతిస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి