పవన్ 'తుఫాన్' ధాటికి 'ఎవడు' అక్టోబర్‌కు కొట్టుకుపోయింది...?

బుధవారం, 7 ఆగస్టు 2013 (14:13 IST)
FILE
రాష్ట్ర విభజన ప్రభావం తెలుగు సినిమాలపై పడింది. కోట్లాది రూపాయలు పెట్టుబడిపెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు పరిస్థితి అయోమయంలో పండింది. ముఖ్యంగా ఈ ప్రభావం మెగా ఫ్యామిలీ చిత్రాలకు ఎక్కువుగా ఉంది. విడుదలకు అన్ని కార్యక్రమాలు ముగించుకున్నా రిలీజ్ కాలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.

ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 31 న విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'ఎవడు' చిత్రాన్ని ఆగష్టు 21కి వాయిదా వేశారు. ఇప్పుడు దీనిని కూడా మరింత పొడిగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సీమాంధ్రలో పరిస్థితులు కుదుటపడితే ముందుగా పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాని విడుదల చేస్తారు.

ఆ తర్వాత చరణ్ నటించిన 'జంజీర్' (తెలుగులో తుఫాన్) సినిమా లైన్లో ఉంది. సెప్టెంబర్ 6న దీనిని దేశవ్యాప్తంగా విడుదల చేస్తారు. కాబట్టి, ఇక 'ఎవడు' సినిమాకి మరింత సమయం అవసరమవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే అక్టోబర్ 4న దీనిని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

వెబ్దునియా పై చదవండి