వినాయకుడు, విలేజ్లో వినాయకుడు వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన కృష్ణుడు హీరోగా మరో విభిన్న కథా చిత్రం రూపొందనుంది. మాస్టర్ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పణలో శ్రీశివపార్వతి కంబైన్స్ బేనర్పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న 'నాకూ ఓ లవరుంది' పాటలు మినహా టాకీపార్ట్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత కె.సురేష్బాబు మాట్లాడుతూ - ''యూనిట్లోని అందరి కోఆపరేషన్తో ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని సారథీ స్టూడియోలో వేసిన సెట్లో ఐటమ్ సాంగ్ను చిత్రీకరిస్తున్నాం. బాంబే మోడల్ రేష్మి, హీరో కృష్ణుడుతోపాటు హీరో ఫ్రెండ్స్ బ్యాచ్, డాన్సర్స్పై ఈ పాటను తీస్తున్నాం. ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్ రాధాకృష్ణన్ మ్యూజిక్. ఇందులో ఐదు పాటలు వున్నాయి. అన్ని పాటలు సూపర్హిట్ అయ్యేలా ఆయన ట్యూన్ చేశారు.
ఈ నెలాఖరులో ఆడియో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశాం. ఈనెల 11 నుంచి బ్యాంకాక్లో బ్యాలెన్స్ పాటల చిత్రీకరణ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్లో చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాం'' అన్నారు.
దర్శకుడు కె.రామ్వెంకీ మాట్లాడుతూ - ''మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వస్తోంది. నేను ఫస్ట్టైమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి మంచి నిర్మాత దొరికారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా బాగా రావడానికి సహకరిస్తున్నారు. కృష్ణుడు సినిమా అంటేనే ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే స్టార్టింగ్ టు ఎండింగ్ అందరూ నవ్వుకునేలా ఈ సినిమా వుంటుంది'' అన్నారు.