బండ్ల గణేష్ చిత్రం రామ్ చరణ్కు రూ.17కోట్లు, శివకి 2 కోట్లు...!
శుక్రవారం, 3 మే 2013 (14:11 IST)
FILE
'లక్ ఉంటే లక్ష్మీ' అనే టైటిల్ మిర్చి సినిమా దర్శకుడు కొరటాల శివకి సరిగా సరిపోతుంది. రామ్ చరణ్ హీరోగా పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమాకు ఆయన 2 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఒక్క సినిమాతో కొరటాల శివ సక్సెస్ఫుల్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ప్రభాస్తో ఆయన తీసిన 'మిర్చి' సినిమా హిట్టవడంతో ఇప్పుడీ దర్శకుడికి మంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మించే చిత్రానికి డైరక్టర్ శివ రెండు కోట్ల రూపాయల పారితోషికం అందుకొంటున్నాడని ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మిర్చి సినిమాకి కోటి రూపాయలు తీసుకున్నాడట. ఇదిలావుంచితే, చరణ్కు కూడా భారీ స్థాయిలో 17 కోట్ల రూపాయలను ఈ సినిమా కోసం బండ్ల గణేష్ పారితోషికంగా ఇవ్వనున్నాడనే ప్రచారం జోరుగానే సాగుతోంది.