బాలయ్య శ్రీరామునిగా నటించే "శ్రీరామరాజ్యం" చిత్రం సోమవారం రామకృష్ణ స్టూడియోలో ప్రారంభమైంది. బాపూ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రీరాముని పాత్రను బాలయ్య పోషిస్తుండగా, లక్ష్మణుడిగా శ్రీకాంత్ నటిస్తున్నాడు. సీతాదేవిగా నయనతార నటిస్తుండగా, వాల్మీకి పాత్రలో ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు కన్పించనున్నారు.
శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'లవకుశ' ముళ్లపూడి వెంకటరమణ స్క్రీన్ప్లే, డైలాగ్లు అందించనున్నారు. ప్రస్తుతం పరమవీర చక్ర చిత్రంతో బిజీ బిజీగా ఉన్న బాలకృష్ణ, బాపూ దర్శకత్వంలో రూపుదిద్దుకునే శ్రీరామరాజ్యం చిత్రంలోనూ నటించబోతున్నారు. ఈ సినిమా ముహూర్తపు షాట్ను రామకృష్ణ స్టూడియోలో చిత్రీకరించారు.
"సింహా" హిట్ తర్వాత ఆఫర్ల వెల్లువతో బిజీబిజీగా ఉన్న బాలయ్య బాబుకు శ్రీరామరాజ్యం సినిమా మంచి క్రేజ్ సంపాదించిపెడుతుందని సినీ వర్గాల సమాచారం.