మాజీ ప్రియుడి ఫిర్యాదు.. వీణా మాలిక్‌పై కేసు నమోదు!

మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (16:46 IST)
File
FILE
నిన్న మొన్నటి వరకు తనతో డేటింగ్ చేసిన సినీ నటి వీణా మాలిక్‌పై మాజీ ప్రియుడు ప్రశాంత్ ప్రతాప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముంబై పోలీసులు వీణాపై కేసు నమోదు చేశారు. తనను కాదని మరొకరిని వీణా వివాహం చేసుకోబోతోందని, దీన్ని అడ్డుకోవాలని అందులో కోరినట్టు సమాచారం.

వీణా మాలిక్‌తో ముంబైకు చెందిన ప్రశాంత్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి డేటింగ్ చేస్తూ వచ్చాడు. ఇపుడు ఉన్నట్టుండి దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించింది.

ఈ విషయం తెలిసిన ప్రశాంత్ ప్రతాప్ సింగ్... వీణా మాలిక్‌కు ఫోన్ చేశాడు. మరోసారి కాల్ చేస్తే అత్యాచారం చేశావని కేసు పెడతానని, అలాగే, పాత విషయాలు తన భర్తకు చెబితే కేసు పెడతానని హెచ్చరించినట్లు ప్రతాప్ తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి